వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐ.టి.లో ఆంధ్రప్రగతి భేష్‌ః జగన్నాథ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఆంధ్రతోసంబంధాలను మెరుగుపరచుకోనున్నట్లుమారిషస్‌ ప్రధాని అనిరూద్‌ జగన్నాథ్‌ప్రకటించారు. భారత దేశ పర్యటనలోభాగంగా గురువారం నగరానికి విచ్చేసిన జగన్నాథ్‌శుక్రవారం మాదాపూర్‌ లోని ప్రతిష్ఠాత్మక హైటెక్‌సిటీని, ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీఇనిస్టిట్యూట్‌ ను సందర్శించారు.

హైటెక్‌ సిటీలో జగన్నాథ్‌ కు రాష్ట్రరోడ్లు, భవనాల శాఖ మంత్రి విజరామారావుస్వాగతం పలికారు. రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ ప్రత్యేక కార్యదర్శి సహానీ ఈరంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని స్లైడ్లద్వారా ఆయనకు వివరించారు. ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకుకృషి చేస్తున్న సంస్థలకు రాష్ట్రప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నట్లు ఆయనచెప్పారు. ఐ.టి. ఫలాలను ప్రజలకు అందించేందుకుగాని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న తరహాలోట్విన్స్‌, కార్డు పథకాలను ప్రారంభించిందనిఆయన వివరించారు.

ఈ సందర్భంగా జగన్నాథ్‌ మాట్లాడుతూఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం అభివృద్ధికిరాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనుప్రశంసించారు. ఐ.టి. రంగంలో ఆంధ్రతోసంబంధాలను మరింత పటిష్టంచేసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.హైటెక్‌ సిటీలో వివిధ సంస్థలు ఏర్పాటుచేసిన ఐ.టి. ఎగ్జిబిషన్‌ ను జగన్నాథ్‌ ఈసందర్భంగా సందర్శించారు.

గురువారం విమానాశ్రయంలో అనిరుద్‌ జగన్నాథ్‌కు చంద్రబాబు స్వాగతం పలికారు. అయితేతన డ్రీం ప్రాజెక్టు అయిన హైటెక్‌సిటీని జగన్నాధ్‌ సందర్శించే సందర్భంగాచంద్రబాబు ఆయన వెంట లేకపోవడం అందరినీఆశ్చర్య పరిచింది. రాష్ట్ర మంత్రి విజయరామారావుమాత్రమే అనిరూథ్‌ జగన్నాథ్‌ వెంట వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X