వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్జీలకు సభాసంఘం సమర్ధన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీ పరిశీలనకు ఏర్పాటయిన సభా సంఘం తుది నివేదికలో తన సూచనలు పొందపరచలేదని బిజెపి విమర్శించడం బాధాకరమని సభా సంఘం చైర్మన్‌
ఆర్‌. ప్రకాష్‌ రెడ్డి ఆన్నారు. మెజారిటీ అభిప్రాయం ప్రకారమే సిఫారసులు వుంటాయి తప్ప మైనారిటీ అభిప్రాయాలు సిఫారసులు కావని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

సభా సంఘం ప్రత్యేక ఆహ్వానితుడైన మజ్లీస్‌ పక్షం నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ అసమ్మతి నోట్‌ను కూడా నివేదికలో పొందు పరిచామని, అదే విధంగా బిజెపి శాసనసభా పక్షం నాయకుడు ఎన్‌. ఇంద్రసేనా రెడ్డి అభిప్రాయాలను కూడా పొందుపరిచామని ఆయన అన్నారు. తాను ఐదు స్లాబ్‌ల విధానాన్ని బలపరిచానని, అయితే, మెజారిటీ ఆరు స్లాబ్‌లుండాలని అభిప్రాయపడిందని, మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆరు స్లాబ్‌లను సిఫారసు చేశామని ఆయన చెప్పారు. ఆరు స్లాబులు వుండాలని గట్టిగా కోరిన వారుఇంద్రసేనారెడ్డి ఈ విషయంలో ప్రభుత్వం వైఖరి ఎలా తప్పుపట్టగలరని ఆయన ప్రశ్నించారు.

సాధారణంగా సభాసంఘాల నివేదికల్లో ప్రత్యేక ఆహ్వానితుల అసమ్మతినోట్‌ను పొందుపర్చరని కాని సంప్రదాయానికి భిన్నంగా తాము ఒవైసి నోట్‌ను కూడా నివేదికలో పొందుపర్చామని ఆయన వివరించారు.

విద్యుత్‌ ఛార్జీల విషయంలో నివేదికను ఖరారు చేసేందుకు దాదాపు పది రాష్ట్రాల్లో సభాసంఘం పర్యటించిందని ఆయన చెప్పారు. సిఫారసుల విషయంలో ఆర్ధికాంశాలకే తప్ప తాము రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. తమ అధ్యయాన్ని బట్టి విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అనివార్యం, అత్యవసరం అని తేలిందని కూడా ఆయన చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో మిగిలిన రాష్ట్రాల కంటే అధికంగా విద్యుత్‌ చార్జీలు వున్నాయని ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X