కేంద్రంపైవి.హెచ్.పి. యుద్ధభేరి
కుంభనగర్ః వివాదస్పదమైన అయోధ్య రామాలయ నిర్మాణానికి ముహూర్తం ప్రకటించే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న ధర్మసంసద్ శుక్రవారం నుంచి ప్రారంభమయింది. ఆలయం లాగానే ఈ ధర్మసంసద్ వ్యవహారం కూడా వివాదాస్పద విషయంగానే మారింది.
ధర్మసంసద్లో దాదాపు అందరు సాధువులు, సంత్లు పాల్గొంటున్నారని విహెచ్పి ప్రకటించగా, మరో వైపు అఖిల భారత అంకారా పరిషత్, ద్వారక శంకరాచార్యులు మాత్రం సంసద్కు తాము దూరంగా వున్నామని ప్రకటించారు. మూడు రోజుల సంసద్లో హిందూవులు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలపై చర్చలు జరుపుతామని విహెచ్పి నేత అశోక్ సింఘాల్ ప్రకటించారు. ఎవరు ఎమన్నా రెండు రోజుల్లో ఆలయ నిర్మాణానికి ముహూర్తాన్ని ఖరారు చేసి, నిర్మాణం ఆరంభానికి ముందుకు కదులుతామని ఆయన చెప్పారు.
ఈ
విషయంలో
కేంద్ర
ప్రభుత్వంతో
ఢీకొనడానికి
కూడా
తాము
సిద్ధంగా
వున్నామని
ఆయన
చెప్పారు.
శివరాత్రిలోపుగా
ప్రభుత్వం
అయోధ్యలోని
వివాదాస్పద
స్ధలాన్ని
తమకు
అప్పగించాలని
కూడా
విహెచ్పి
డిమాండ్
చేసింది.
రామాలయనిర్మాణానిక
సహకరించడం
ముస్లీంలకే
మంచిదని
కూడా
విహెచ్పి
పేర్కొంది.
కాగా
విహెచ్పి
వ్యవహారం
అంతారాజకీయ
మయంగా
వున్నదని
ద్వారక
శంకరాచార్యులు
విమర్శించారు.
సంసద్లో
తాము
పాల్గొనడంలేదని
ఆయన
స్పష్టం
చేశారు.కాగా
సాధువుల్లోని
అన్ని
వర్గాలను
కలుపుకునేందుకు
విహెచ్పి
నేతలు
చేసిన
ప్రయత్నాలు
ఫలించినట్టుగా
కనిపించలేదు.