వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు ప్రమాదాలు-ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు చోట్ల శుక్రవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు.

విజయనగరం జిల్లా బుజ్జంగివలస గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా, గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

విజయనగరం జిల్లా బుజ్జంగివలస వద్ద ఒక లారీ అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొంది. వెంటనే మంటలు వచ్చాయి. లారీ ఈ మంటల్లో చిక్కుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఒక జీపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. వీరందరూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X