వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః ఆక్వా రైతులనుఆదుకొనేందుకు కోస్తా జిల్లాలలో ఆక్వా క్లబ్బులను ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలోప్రకటించింది. ఆక్వా రైతుల దుస్థితిపై అసెంబ్లీజీరో అవర్‌ లో సావధాన తీర్మానంపై చర్చజరిగింది. ఆక్వా రైతుల్ని ఆదుకొనేందుకు త్వరలో సీడ్‌చట్టాన్ని తీసుకు వస్తున్నట్లు కూడా ప్రభుత్వంప్రకటించింది.ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిదేళ్ళకిందట ఓ వెలుగు వెలిగిన ఆక్వా పరిశ్రమ ఇప్పుడుపీకలలోతు కష్టాలలో కూరుకు పోయింది. కోట్లాదిరూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేఅవకాశం వున్న ఈ పరిశ్రమపై ప్రభుత్వం చిన్నచూపుచూసిన కారణంగానే ఆక్వా రైతులు దుర్గతిపాలయ్యారని అసెంబ్లీలో శుక్రవారం పలువురు సభ్యులుఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులను ఆదుకొనేందుకు ఒక సమగ్రచట్టం లేకపోవడం పట్ల ప్రభుత్వ విప్‌ కాగితంవెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.ఆక్వా రైతులకు నకిలీ రొయ్య పిల్లలను అమ్మతున్నవారి ఆటకట్టించేందుకు ఎటువంటి చట్టాలులేవని, దీనితో రైతుల భవిష్యత్తు అంధకారబంధురంగా మారుతున్నదని ఆయన అన్నారు.ఆక్వారైతులను ఆదుకొనేందుకు తీసుకోవలసినచర్యలను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీవేసి, పకడ్బందీగా చట్టాలను రూపొందించాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం కూడా సభ్యులఆవేదనకు అనుకూలంగా స్పందించింది. ఆక్వా రైతులకు భద్రతకల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామనిహామీ ఇచ్చింది. త్వరలో సీడ్‌ చట్టం తీసుకురావాలని ప్రభుత్వంయోచిస్తున్నదని మత్స్యశాఖ మంత్రిచెప్పారు. ఆక్వా రైతులలో ఆధునిక పరిణామాల పట్లఅవగాహన పెంపొందించేందుకు వీలుగా కోస్తాజిల్లాల్లో ఆక్వా క్లబ్‌ లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వంప్రకటించింది.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆక్వా రైతులనుఆదుకొనేందుకు కోస్తా జిల్లాలలో ఆక్వా క్లబ్బులను ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలోప్రకటించింది. ఆక్వా రైతుల దుస్థితిపై అసెంబ్లీజీరో అవర్‌ లో సావధాన తీర్మానంపై చర్చజరిగింది. ఆక్వా రైతుల్ని ఆదుకొనేందుకు త్వరలో సీడ్‌చట్టాన్ని తీసుకు వస్తున్నట్లు కూడా ప్రభుత్వంప్రకటించింది.

ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిదేళ్ళకిందట ఓ వెలుగు వెలిగిన ఆక్వా పరిశ్రమ ఇప్పుడుపీకలలోతు కష్టాలలో కూరుకు పోయింది. కోట్లాదిరూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేఅవకాశం వున్న ఈ పరిశ్రమపై ప్రభుత్వం చిన్నచూపుచూసిన కారణంగానే ఆక్వా రైతులు దుర్గతిపాలయ్యారని అసెంబ్లీలో శుక్రవారం పలువురు సభ్యులుఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులను ఆదుకొనేందుకు ఒక సమగ్రచట్టం లేకపోవడం పట్ల ప్రభుత్వ విప్‌ కాగితంవెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆక్వా రైతులకు నకిలీ రొయ్య పిల్లలను అమ్మతున్నవారి ఆటకట్టించేందుకు ఎటువంటి చట్టాలులేవని, దీనితో రైతుల భవిష్యత్తు అంధకారబంధురంగా మారుతున్నదని ఆయన అన్నారు.ఆక్వారైతులను ఆదుకొనేందుకు తీసుకోవలసినచర్యలను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీవేసి, పకడ్బందీగా చట్టాలను రూపొందించాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం కూడా సభ్యులఆవేదనకు అనుకూలంగా స్పందించింది. ఆక్వా రైతులకు భద్రతకల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామనిహామీ ఇచ్చింది. త్వరలో సీడ్‌ చట్టం తీసుకురావాలని ప్రభుత్వంయోచిస్తున్నదని మత్స్యశాఖ మంత్రిచెప్పారు. ఆక్వా రైతులలో ఆధునిక పరిణామాల పట్లఅవగాహన పెంపొందించేందుకు వీలుగా కోస్తాజిల్లాల్లో ఆక్వా క్లబ్‌ లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వంప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X