వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్‌లో ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: శ్రీనగర్‌లో శుక్రవారం నాడు జరిగిన పోలీసు కాల్పుల సంఘటన జమ్మూకాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి మృతి చెందడంతో గతరెండు రోజుల్లో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకున్నది.

పోలీసు లాకప్‌లో మెడికల్‌ షాప్‌ యజమాని మృతి చెందిన సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శన చేస్తున్నవారిపై గురువారం నాడు పోలీసులు కాల్పులు జరపడంతో ఆయిదుగురు వ్యక్తులు మరణించిన విషయం విదితమే.

రాష్ట్ర అసెంబ్లీలో కూడా శుక్రవారం నాడు వివిధ పార్టీలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. భద్రతాదళాల వైఖరిని నిరసిస్తూ దాదాపు అన్నిపార్టీలు సభనుంచి వాకౌట్‌ చేశాయి. శ్రీనగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా వుండటంతో కర్ఫ్యూ విధించారు. వీధుల్లో ప్రదర్శనకారులు చేరి పోలీసులపై రాళ్లు రువ్వుతూ నినాదాలు చేయడం కనిపించింది. అమాయక ప్రజలపై పోలీసులు అమానుషంగా కాల్పులు జరిపారని రాజకీయ పార్టీలుఆరోపిస్తున్నాయి.కాల్పుల సంఘటనపై సిట్టింగ్‌ జడ్జ్‌తో న్యాయవిచారణకు ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా ఆదేశాలుజారీ చేశారు. కాగా కేంద్ర తాజాగా మరో మూడువేల మంది భద్రతాసిబ్బందిని కాశ్మీర్‌కు పంపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X