వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామ స్వరాజ్యంతోనే భారత ప్రగతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పట్టణాలు పల్లెల మధ్య అంతరాలు పెరగడం మంచిది కాదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్య నాయుడు అన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ సోమవారం హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆస్ట్రేలియాతో సహా 13 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ధనిక పేద వర్గాల మధ్య అంతరాలు పెరిగిపోతే భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయని ఆయన అన్నారు. అధికారవికేంద్రీకరణ ద్వారా గ్రామీణాభ్యుదయాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. స్థానిక సంస్థలను మరిన్ని అధికారాలు, నిధులతో బలోపేతం చేసినప్పుడే గ్రామస్వరాజ్యం ఏర్పడుతుందని, అదే దేశ ప్రగతికి బాటలు వేస్తుందని ఆయన చెప్పారు.

సంస్కరణలవల్ల పేదరిక నిర్మూలన జరగకపోతే, పేదలకు ఉపయోగపడకపోతేఅర్థం లేదనే వ్యాఖ్యలు వినబడుతున్నాయని, సంస్కరణలుపేదలకు ఉపయోగ పడి, పేదరికాన్ని నిర్మూలించేదిశలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందనిఆయన అన్నారు.

రైతులను, గ్రామీణులను త్రిశంకుస్వర్గంలో వదిలేయకుండా వారికి తగిన సహాయంఅందించాలని మంత్రి ఆర్థిక సంస్థలను కోరారు. పేదలను, గ్రామీణులనుఆదుకోవడానికి ముందు రావాలని ఆయన వాటికిసూచించారు. పట్టణాలకు, గ్రామలకు మధ్య అంతరంరూపుమాపేందుకు కృషి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X