కంప్యూటరీకరణవల్ల ఉద్యోగాలు పోవు
హైదరాబాద్: కంప్యూటరీకరణవల్ల ఉద్యోగాలు తగ్గవని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు చెప్పారు. శాసనసభప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు శనివారం సమాధానమిస్తూఆయన ఈ విషయం చెప్పారు. కంప్యూటరీకరణ వల్ల ఉద్యోగాలు కూడా పోవనిఆయన హామీ ఇచ్చారు.
ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకుఅందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుఆయన తెలిపారు. కంప్యూటరీకరణ వల్ల మెరుగైనసేవలు అందుతాయని, తగిన సమయంలో సేవలుఅందించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. కంప్యూటరీకరణవల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రెవెన్యూ పెరుగుతుందనిఆయన చెప్పారు. ప్రభుత్వోద్యోగులతో పాటు శాసనసభ్యులకు కూడా కంప్యూటర్ శిక్షణ ఇస్తామనిఆయన చెప్పారు.
కంప్యూటరీకరణ వల్ల సమస్యలు రాకూడదని సభ్యులు అంతకుముందు సూచించారు. తమ నియోజక వర్గంలో కంప్యూటర్లవాడకం ఇబ్బందిగా పరిణమించిందని, వాటి వాడకంఉద్యోగులకు, అధికారులకు తెలియకపోవడంతో సమస్యలుఉత్పన్నమవుతున్నాయని కె.ఆర్. సురేష్ రెడ్డి(కాంగ్రెస్) అన్నారు.