వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిడబ్లుసి ఎన్నికల్లో అంతసవ్యమే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటి ఎన్నికల్లో ఏ లోపాలు జరగలేదని సీనియర్ కాంగ్రెస్ నేత అర్జున్సింగ్ చెప్పారు. శనివారం నాడు హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంప్రదయానికి అనుగుణంగానే సిడబ్లుసి నియామకాలు వున్నాయని ఆయన తెలిపారు.
దళితులు, బలహీన వర్గాలకు సముచిత స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీల్లో కల్పించినట్టుగా ఆయన చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అర్జున్సింగ్ అన్నారు. నానాపార్టీలతో ఏర్పడిన కూటములు ముఖ్యంగా, ప్రాంతీయ పార్టీల దన్నుతో ఎర్పడిన కూటములు జాతీయ ప్రయోజనాలను రక్షించడంతో ఘోరంగా విఫలమవుతాయని ఆయన చెప్పారు. గత ఏడెనెమిది సంవత్సరాల్లో దేశ అనుభవం కూడా అదేనని ఆయన అన్నారు.
Story first published: Saturday, February 17, 2001, 23:53 [IST]