వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్లో కొనసాగుతున్న హింసాకాండ
శ్రీనగర్లో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతునే వున్నాయి. తాజా ఘటనల్లోపోలీసు అధికారితో సహా మరో నలుగురు మరణించారు. శ్రీనగర్ వీధుల్లో భద్రతా దళాలకు ప్రదర్శకులకు మధ్య శనివారం నాడంతా హోరాహోరీ నడుస్తూనే వున్నది.
ఆంక్షలను ఉల్లంఘించిన కాశ్మీర్నేత ఫ్రీడం పార్టీనేత షబ్బీర్ షాను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రం పంపిన అదనపు బలగాలు కూడా కాశ్మీర్ చేరుకున్నాయి. హురియత్ కాన్ఫరెన్స్ జరిపిన ప్రదర్శన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలతో పోలీసులు మరోమారు కాల్పులు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా వున్న దృష్ట్యా కర్ఫ్యూను సడలించేది లేదని పోలీసులు అంటున్నారు.
Comments
Story first published: Saturday, February 17, 2001, 23:53 [IST]