తృణమూల్తో కాంగ్రెస్ నెయ్యం Home Full Story
కొల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికార వామపక్షపార్టీని ఎదుర్కొవడానికి తృణమూల్తో పొత్తు పెట్టుకోవాలని చిరకాలంగా డిమాండ్చేస్తున్న పశ్చిమబెంగాల్లోని కాంగ్రెస్ అసమ్మతి గ్రూప్ తనపంతం నెగ్గించుకున్నట్టుగా తెలిసింది.
తృణమూల్తో పొత్తుకు కాంగ్రెస్ అధిష్టానవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే కాంగ్రెస్ రాజకీయ వ్యూహం గందరగోళంగా తయారయ్యే అవకాశం వున్నదని పరిశీలకులు అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీతో వున్న నేస్తం అడ్డం రాకుండా పశ్చిమబెంగాల్ వరకే ఈ రెండు పార్టీలు ఎలా పొత్తు పెట్టుకోగలవో వేచి చూడాల్సి వుంది.
గత
పార్లమెంట్
ఎన్నికల్లో
బీజేపీతో
కలసి
పోటీ
చేసిన
తృణమూల్
అధినేత్రి
మమతా
బెనర్జీ
ఇప్పుడు
అసెంబ్లీ
ఎన్నికల్లో
కాంగ్రెస్తో
పొత్తుపెట్టుకుని
బీజేపీని
దూరం
చేసుకోగలరా
అన్నది
అనుమానమే.
ఒకవేళ
బీజేపీ,
తృణమూల్
కలసి
పోటీ
చేస్తే
ఆ
కూటమిలో
కాంగ్రెస్
దూరటం
దాదాపు
అసాధ్యం.
అయితే
బీజేపీతో
నిమిత్తంలేకుండా
తమతో
చేతులు
కలపడానికి
మమత
అంగీకరించారని
బెంగాల్
కాంగ్రెస్
నేతలు
అంటున్నారు.
తమ
అగ్రనేతతో
త్వరలోనే
మమతా
బెనర్జీ
భేటీని
కూడా
తాము
ఏర్పాటు
చేస్తున్నట్టుగా
వారు
చెబుతున్నారు.