వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీ పార్లమెంట్లో మహిళా బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్రపార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్మహాజన్ చెప్పారు.
శనివారం నాడు కోయంబత్తూర్లో స్వదేశీ పారిశ్రామిక మేళలో పాల్గొన్న మహాజన్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, గత సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టలేకపోయిన మహిళా బిల్లును ఈ సారి బడ్జెట్ సమావేశాల్లోనైనా చర్చకు పెట్టాలని ప్రధాని వాజ్పేయి కృతనిశ్చయంతో వున్నారని అన్నారు.
ఈ విషయంలో ప్రధాని అన్ని పార్టీల సహకారం కోసం అఖిల పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా మహాజన్ వెల్లడించారు. మహిళా బిల్లు, రాజ్యంగ సవరణతో కూడుకున్నది కావడంతో సమస్య ఉత్పన్నమవుతున్నదని ఆయన అన్నారు. బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి సభ ఆమోదం పొందడానికి నిర్థిష్టమైన కోరం అవసరమని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, February 17, 2001, 23:53 [IST]