కాశ్మీర్లో కాల్పులవిరమణపై నిర్ణయం!?
న్యూఢిల్లీః రంజాన్ మాసం నుంచీ కాశ్మీర్లో కొనసాగుతున్న కాల్పుల విరమణ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునేందుకు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీఆదివారం సాయంత్రం సమావేశం అవుతోంది. గతంలో పొడిగించిన కాల్పుల విమరణ గడువు మరో 10 రోజులలో ముగుస్తుండటంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగించే విషయంలో ఉన్న లోతుపాతులను చర్చిస్తారు. అయితే ఈ ఏకపక్ష కాల్పుల విరమణ కారణంగా ఎటువంటి అనుకూల ప్రభావం లేదని, తీవ్రవాదుల కార్యకలాపాలు రోజు రోజుకీ పేట్రేగిపోతున్నాయనే విమర్శలు ఉన్న నేపథ్యంలో కొనసాగింపు విషయమై ప్రధాని ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
ఇదిలా
ఉండగా,
కాల్పుల
విరమణ
కొనసాగిస్తే
బాగుంటుందని
కాశ్మీర్
రాష్ట్ర
ముఖ్యమంత్రి
ఫరూక్
అబ్దులా
అభిప్రాయపడ్డారు.
అయితే
రాష్ట్రంలోని
పరిస్థితిని
సమీక్షించి
తదనుగుణంగా
కొన్ని
చర్యలు
తీసుకోవాల్సిన
అవసరం
ఉందని
కూడా
ఆయన
అన్నారు.
భద్రతా
వ్యవహారాల
కమిటీ
సమావేశంలో
ప్రధాని
వాజ్పేయితో
పాటు,
హోం
మంత్రి
అద్వానీ,
జార్జి
ఫెర్నాండెజ్,
జస్వంత్
సింగ్,
యశ్వంత్
సిన్హా
తదితరులు
పాల్గొంటారు.