హైదరాబాద్ః వై.ఎస్. రాజశేఖ రెడ్డిపైఅక్రమంగా కేసు నమోదు, నల్గొండలో పౌరహక్కుల సంఘం నేతఅజం ఆలీ దారుణ హత్యలపై ప్రభుత్వం ఇచ్చినవివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూకాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. వై.ఎస్. అక్రమ నిర్బంధపైహక్కుల తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ ప్రతిభా భారతి అనుమతించకపోవడంతోకాంగ్రెస్ పార్టీ గంటసేపు సభా కార్యక్రమాలను స్తంభింపచేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రకటనఇచ్చేందుకు అంగీకరించడంతో కొంత రభస అనంతరం సభా కార్యక్రమాలుయధావిధిగా సాగాయి.వై.ఎస్. ను కడపజిల్లాలో నిర్బంధించిన అంశంపై రాష్ట్ర హోం శాఖ మంత్రిదేవేందర్ గౌడ్ సభలో ఒక ప్రకటనచేశారు. బద్వేలులో ఎస్.సి, ఎస్టీ మహిళలనుదూషించినందుకు, ఎన్నికల కోడ్ నుఉల్లంఘించినందుకు వై.ఎస్. పై కేసు నమోదైందనిఆయన చెప్పారు. గడువు ముగిసిన అనంతరం కూడా ప్రచారం సాగించడాన్ని ప్రజలుఅడ్డుకున్నారని, ఈ తప్పును కూడా ప్రభుత్వం పైరుద్దేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నదని ఒకదశలో దేవేందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.పౌరహక్కుల సంఘం నాయకుడు ఆజం ఆలీనినల్గొండలో దారుణంగా చంపడంపై విచారణ జరిపిస్తామనిదేవేందర్ గౌడ్ ప్రకటించారు. దేవేందర్ గౌడ్ప్రకటనతో తీవ్ర అసంతృప్తి చెందినకాంగ్రెస్ శాసన సభ్యులు ఆయన ప్రకటన పత్రాలనుచించివేశారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్ల్యేలు కూడా రెచ్చి పోయికాంగ్రెస్ వారిపై ఆరోపణలకు దిగారు.ఇరు పక్షాల నేతలకు సర్దిచెప్పేందుకు స్పీకర్ స్థానంలో కూర్చున్న చంద్రశేఖర రావుప్రయత్నించారు. అయినా ఇరువర్గాల సభ్యులు వాగ్వివాదానికి దిగడంతో సభలోకొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన పట్ల అసంతృప్తితోకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్ల్యేలు సభ నుంచి వాకౌట్చేశారు.
హైదరాబాద్ః వై.ఎస్. రాజశేఖ రెడ్డిపైఅక్రమంగా కేసు నమోదు, నల్గొండలో పౌరహక్కుల సంఘం నేతఅజం ఆలీ దారుణ హత్యలపై ప్రభుత్వం ఇచ్చినవివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూకాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. వై.ఎస్. అక్రమ నిర్బంధపైహక్కుల తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ ప్రతిభా భారతి అనుమతించకపోవడంతోకాంగ్రెస్ పార్టీ గంటసేపు సభా కార్యక్రమాలను స్తంభింపచేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రకటనఇచ్చేందుకు అంగీకరించడంతో కొంత రభస అనంతరం సభా కార్యక్రమాలుయధావిధిగా సాగాయి.
వై.ఎస్. ను కడపజిల్లాలో నిర్బంధించిన అంశంపై రాష్ట్ర హోం శాఖ మంత్రిదేవేందర్ గౌడ్ సభలో ఒక ప్రకటనచేశారు. బద్వేలులో ఎస్.సి, ఎస్టీ మహిళలనుదూషించినందుకు, ఎన్నికల కోడ్ నుఉల్లంఘించినందుకు వై.ఎస్. పై కేసు నమోదైందనిఆయన చెప్పారు. గడువు ముగిసిన అనంతరం కూడా ప్రచారం సాగించడాన్ని ప్రజలుఅడ్డుకున్నారని, ఈ తప్పును కూడా ప్రభుత్వం పైరుద్దేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నదని ఒకదశలో దేవేందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పౌరహక్కుల సంఘం నాయకుడు ఆజం ఆలీనినల్గొండలో దారుణంగా చంపడంపై విచారణ జరిపిస్తామనిదేవేందర్ గౌడ్ ప్రకటించారు. దేవేందర్ గౌడ్ప్రకటనతో తీవ్ర అసంతృప్తి చెందినకాంగ్రెస్ శాసన సభ్యులు ఆయన ప్రకటన పత్రాలనుచించివేశారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్ల్యేలు కూడా రెచ్చి పోయికాంగ్రెస్ వారిపై ఆరోపణలకు దిగారు.
ఇరు పక్షాల నేతలకు సర్దిచెప్పేందుకు స్పీకర్ స్థానంలో కూర్చున్న చంద్రశేఖర రావుప్రయత్నించారు. అయినా ఇరువర్గాల సభ్యులు వాగ్వివాదానికి దిగడంతో సభలోకొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన పట్ల అసంతృప్తితోకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్ల్యేలు సభ నుంచి వాకౌట్చేశారు.