వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుల్లో ఆంధ్రా టాప్‌ః బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చంద్రబాబునాయుడు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం తెస్తున్నఅప్పులు, ఆదాయ వ్యయాలపై సోషల్‌ ఆడిటింగ్‌ జరపాలనిమిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ డిమాండ్‌చేసింది. బడ్జెట్‌ పై బిజెపి సభా పక్ష నాయకుడుఇంద్రసేనా రెడ్డి శనివారం అసెంబ్లీలో గంటకు పైగాసుదీర్ఘంగా ప్రసంగించారు. సుదీర్ఘ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రుణభారంపెరిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

విజన్‌ 2020 పధకానికి 30 లక్షల కోట్లరూపాయల వ్యయాన్ని అంచనా వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రాన్నిఅప్పులకుప్పగా మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నదా అనేఅనుమానం వస్తున్నదని ఆయన అన్నారు.రాష్ట్రంలో పూర్తి స్థాయి టీచర్లను నియమించేందుకునిధులు లేక వేలాది మంది తాత్కాలికసిబ్బందిని నియమిస్తున్న ప్రభుత్వం విజన్‌ 2020కిఅన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తుందనిఆయన ప్రశ్నించారు. అప్పులు తీసుకురావడం ఏరాష్ట్రానికైన తప్పనిసరి అని అయితే దానికి ఒక అడ్డుఅదుపు వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో అప్పుచేసి పప్పుకూడు తినడం అనే సామెత వుండేదని, ఇప్పుడు ఇంతఅప్పు చేసిన గుప్పెడు మెతుకులు దొరుకుతాయాఅన్న అనుమానం కలుగుతున్నదని ఆయనచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఊహల్లో విహరించడాన్ని కాస్త తగ్గించుకొనివాస్తవ ధృక్పథంతో వ్యవహరించాలనిఇంద్రసేనారెడ్డి సూచించారు. ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలనికేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పినతెలుగుదేశం బడ్జెట్‌ లో ఆ ప్రాజెక్టులను ఒక్కపైసా కూడా కేటాయించలేదని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X