వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సి.ఎం.పేషీలో అవినీతిపై రగడ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రికార్యాలయం అవినీతి నిలయంగా మారిందంటూ మంగళవారం స్థానిక దినపత్రికలోవచ్చిన వార్త మంగళవారం అసెంబ్లీలో గందరగోళంసృష్టించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక జాయింట్‌సెక్రటరీ స్థాయి అధికారి అవినీతి పెచ్చుమీరిపోయిందని, ఈ వ్యవహారం అంతా తెలిసినా సి.ఎం.మౌనంగా వుంటున్నారని ఆ పత్రిక రాసింది. ఆఅధికారి కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఇంటి ఫోటోను కూడా ఆ పత్రికప్రచురించింది.

ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ సభ్యుడుపాల్వాయి గోవర్థన్‌ రెడ్డి సభలో ప్రస్తావించారు.సి.ఎం. పేషీ అవినీతి కేంద్రంగా మారిపోయిందనిధ్వజమెత్తారు. దీనితో జీరో అవర్‌ కొద్దిసేపు స్తంభించిపోయింది. ముందుగా అనుమతి లేకుండా ఇటువంటిఅంశాలను సభలో ప్రస్తావించరాదని స్పీకర్‌ ప్రతిభా భారతిఅన్నారు. ఇందుకు కాంగ్రెస్‌ సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. దీనితో సభలో గందరగోళంప్రారంభమైంది. ఈ దశలో శాసనసభా వ్యవహారాల మంత్రిఅశోక్‌ గజపతి రాజు జోక్యం చేసుకొని ఈ వ్యవహారంపై మూడురోజుల్లో సభకు వివరణ ఇస్తామని హామీఇచ్చారు. దీనితో ప్రతిపక్ష సభ్యులు శాంతించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X