వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంద్రజిత్‌ గుప్తా కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌ కతాః సిపిఐ మాజీ ప్రధానకార్యదర్శి, ప్రముఖ వామపక్ష నేత ఇంద్రజిత్‌ గుప్తామంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయనవయసు 81 సంవత్సరాలు. ప్రస్తుతం మిడ్నాపూర్‌ పార్లమెంటునియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతకాలంగాక్యాన్సర్‌ తో బాధపడుతున్న గుప్తా ఇటీవలేకొత్తఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానసంస్థలో చికిత్స పొందారు. ఆరోగ్యం కొంత మెరుగుపడడంతోఆయన కోల్‌ కత్తాకు తిరిగి వచ్చారు.

వివిధ కార్మిక ఉద్యమాలలో పాల్గొన్నఇంద్రజిత్‌ గుప్తా 11 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దేవెగౌడ, గుజ్రాల్‌సారధ్యంలోని ప్రభుత్వాలలో ఇంద్రజిత్‌ గుప్తాహోం మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.ఆయన అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి.

ప్రముఖుల నివాళిః
సిపిఐ సీనియర్‌ నాయకుడు ఇంద్రజిత్‌ గుప్తా మృతికి రాష్ట్రపతికె.ఆర్‌. నారాయణన్‌, ఉపరాష్ట్ర పతి కృష్ణకాంత్‌, ప్రధానివాజ్‌ పేయి, స్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి తదితరులు ప్రగాఢ సంతాపంవ్యక్తం చేశారు. దేశం ఒక సీనియర్‌ నాయకుడ్నికోల్పోయిందని వారు ఘనంగా నివాళులు అర్పించారు.

పార్లమెంటు నివాళిః వాయిదా
దివంగత వామపక్ష నాయుకుడు ఇంద్రజిత్‌ గుప్తాకు పార్లమెంటు ఉభయ సభలుమంగళవారం ఘనంగా నివాళులు అర్పించాయి. ప్రధానివాజ్‌ పేయి లోక్‌ సభలో సంతాపతీర్మానాన్ని ప్రవేశ పెడుతూసుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌ గా దేశానికి సేవచేసిన గుప్తా తనకుమంచి మిత్రుడన్నారు. లోక్‌ సభ తో పాటు రాజ్య సభ కూడా గుప్తాకునివాళులు అర్పించింది. ఆ తరువాత ఉభయ సభలు గురువారంనాటికి వాయిదా పడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X