న్యూఢిల్లీ: అయోధ్య వివాదం విషయంలో పివి ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంపై వాజ్పేయి సర్కారు వైఖరి ఏమిటో తెలియజేయాలని బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ లిబర్హన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.కాగా పీవీ నరసింహారావు మంగళవారం నాడు రెండోరోజు కూడా లిబరహన్ కమిషన్ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. తన సాక్ష్యం ఇంకా పూర్తికాలేదని ఆయన చెప్పారు. వచ్చే ఏప్రిల్లో మరోసారి కమిషన్ ముందు హాజరు కానున్నట్టుగా ఆయన చెప్పారు. బాబ్రీ విధ్వంసానికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతిపాలన విధించకపోవడాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. మంగళవారం నాడిచ్చిన వాంగ్మూళంలో ఆయన తనకు చివరి క్షణం వరకు బాబ్రీని కూల్చివేసే అవకాశం వున్నదన్న విషయం తెలియదని స్పష్టం చేశారు. ఇంటలీజెన్స్ ఏజెన్సీలుగానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ సూచనప్రాయంగా కూడా ఈ విషయం తమకు తెలిపలేదని ఆయన కమిషన్ ముందుపేర్కొన్నారు. బాబ్రీ కట్టడాన్ని ఎట్టిపరిస్థితిలోనూ తాము రక్షిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజుకూడా గవర్నర్ తన నివేదికలో కట్టడం చుట్టు కరసేవకులు మొహరించి వున్నారని, పరిస్థితి ఉద్రిక్తంగా వున్నదని తెలిపారని అదేసమయంలో కట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం రక్షించగలదనే పేర్కొన్నారని పీవీ తెలిపారు.
న్యూఢిల్లీ: అయోధ్య వివాదం విషయంలో పివి ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంపై వాజ్పేయి సర్కారు వైఖరి ఏమిటో తెలియజేయాలని బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ లిబర్హన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
కాగా పీవీ నరసింహారావు మంగళవారం నాడు రెండోరోజు కూడా లిబరహన్ కమిషన్ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. తన సాక్ష్యం ఇంకా పూర్తికాలేదని ఆయన చెప్పారు. వచ్చే ఏప్రిల్లో మరోసారి కమిషన్ ముందు హాజరు కానున్నట్టుగా ఆయన చెప్పారు. బాబ్రీ విధ్వంసానికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతిపాలన విధించకపోవడాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు.
మంగళవారం నాడిచ్చిన వాంగ్మూళంలో ఆయన తనకు చివరి క్షణం వరకు బాబ్రీని కూల్చివేసే అవకాశం వున్నదన్న విషయం తెలియదని స్పష్టం చేశారు. ఇంటలీజెన్స్ ఏజెన్సీలుగానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ సూచనప్రాయంగా కూడా ఈ విషయం తమకు తెలిపలేదని ఆయన కమిషన్ ముందుపేర్కొన్నారు. బాబ్రీ కట్టడాన్ని ఎట్టిపరిస్థితిలోనూ తాము రక్షిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజుకూడా గవర్నర్ తన నివేదికలో కట్టడం చుట్టు కరసేవకులు మొహరించి వున్నారని, పరిస్థితి ఉద్రిక్తంగా వున్నదని తెలిపారని అదేసమయంలో కట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం రక్షించగలదనే పేర్కొన్నారని పీవీ తెలిపారు.