ఉపగ్రహ సేవల్లో దాపరికంలేదుః బాబు
హైదరాబాద్ః అమెరికన్శాటిలైట్ ఇమేజెస్ ను కేంద్ర అనుమతితోనేఉపయోగించుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అసెంబ్లీలో స్పష్టంచేశారు. ప్రకృతి వైపరీత్యాలను నిరోధించేందుకువీలుగా సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతోఇస్రో సహకారంతో శాటిలైట్ ఇమేజెస్ నుఉపయోగించుకోవాలని ఆంధ్ర ప్రభుత్వం సంకల్పించినవిషయం విదితమే.
అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతిచోటు చేసుకుందంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారంఅసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అనుమానాలువ్యక్తం చేసింది. ఈ వ్యవహారం దేశ భద్రతకుముప్పు కలిగించే అవకాశం వున్నదని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనవ్యక్తం చేశాయి.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతితోనేఉపగ్రహం ద్వారా ఛాయాచిత్రాలు తీసుకుంటున్నామన్నారు. ప్రకృతివైపరీత్యాలను నివారించేందుకు, సత్వర సహాయచర్యలు చేపట్టేందుకు ఈ ఛాయాచిత్రాలు ఎంతగానోఉపయోగ పడతాయని చంద్రబాబు స్పష్టంచేశారు.