వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మౌంట్‌ అబూలోచంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

జైపూర్‌ః బడ్జెట్‌ పై విమర్శలు,నిరంతర రాజకీయ ప్రతివ్యూహాలకు దూరంగాముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజస్థాన్‌లోని ఈశ్వరీయ బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయకేంద్రమైన మౌంట్‌ అబూ వెళ్ళారు. బ్రహ్మకుమారివిశ్వవిద్యాలయంలో జరిగే ప్రపంచ సదస్సులో చంద్రబాబుప్రసంగిస్తారు. బుధవారం ఆయన విశ్వవిద్యాలయాన్నిపరిశీలించారు. బ్రహ్మకుమారీ సంస్థఅధినేతలను కలుసుకొని సుదీర్ఘంగా చర్చలుజరిపారు. యోగ, ధ్యాన అంశాలలో వారు అనుసరిస్తున్నవిధానాలను చంద్రబాబు ఆసక్తిగా అడిగితెలుసుకున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబువెంట ఆయన సతీమణి భువనేశ్వరికూడా వున్నారు.

ప్రాపంచిక విషయాల ద్వారాకలిగే ఒత్తిళ్ళను అధికమించేందుకుఆధ్యాత్మిక శక్తి అవసరమని చంద్రబాబుచెప్పారు. రాజకీయనాయకులలో మార్పు వచ్చేందుకు యోగధ్యానాలు బాగా ఉపయోగపడతాయని చంద్రబాబుఈ సందర్భంగా చెప్పారు. తనను తాను ఇంకా మార్చుకొనేందుకుగాను మౌట్‌ అబూ వచ్చినట్లు చంద్రబాబు వివరించారు.బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌విద్యకు ప్రాథాన్యత ఇవ్వడాన్ని ఆయనప్రశంసించారు. ఆధునిక కాలంలో కంప్యూటర్‌ విద్యరాని వారిని పూర్తి అక్షరాస్యులుగా పరిగణించడంలేదని చంద్రబాబు అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ప్రతిఒక్కరికి కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించాలన్నదేతన స్వప్నం అని ఆయన చెప్పారు.

బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోసౌరశక్తి ప్రాజెక్టు ముఖ్యమంత్రిని బాగా ఆకర్షించింది.సౌరశక్తి ప్లాంటు ద్వారా 20 వేల మందికి వంటచేస్తున్నారు. ఆ ప్రాజెక్టు వివరాలను అడిగితెలుసుకున్న చంద్రబాబు నాయుడుఇటువంటి విధానాన్నే తిరుమలలో అమలుచేయాల్సిందిగా సంబంధిత అధికారులనుఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X