కాల్పుల విరమణమళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో కాల్పుల విరమణను పొడిగించాలనికేంద్ర భద్రతా వ్యవహారాల కేంద్ర కమిటీనిర్ణయించింది. కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్నినెలకొల్పేందుకు, కాశ్మీరీల మనోభావాలనుప్రతిబింబించేందుకు కాల్పుల విరమణనుపొడిగించాలని నిర్ణయించింది. జమ్మూకాశ్మీర్లో కాల్పులవిరమణపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి గురువారం పార్లమెంటులో ప్రకటనచేస్తారు.
ప్రభుత్వ నిర్ణయంపై ప్రధాని గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేస్తారని భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానంతరంహోం మంత్రి ఎల్.కె. అద్వానీ విలేకరులతోచెప్పారు. పార్లమెంటు సమావేశాలుజరుగుతున్నందున నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించడంసాధ్యం కాదని ఆయన అన్నారు. భద్రతనుకట్టుదిట్టం చేయాలని, మిలిటెంట్ల ఆగడాలను అరికట్టడానికి పూర్తిస్వేచ్చనివ్వాలని సమావేశం నిర్ణయించింది.
కాశ్మీర్లో కాల్పుల విరమణపై ప్రధానిఅటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన తొలుతఅఖిల పక్ష సమావేశం జరిగింది. కాల్పుల విరమణకు ప్రతిపక్షాలుఅనుకూలంగా ప్రతిస్పందించాయి. ఈ సమావేశానంతరంబుధవారం సాయంత్రం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంజరిగింది. ఈ సమావేశం దాదాపు గంటా 40 నిమిషాల పాటుసాగింది. హోంమంత్రి ఎల్.కె. అద్వానీ, విదేశాంగ శాఖ మంత్రిజస్వంత్ సింగ్, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, ఆర్థిక మంత్రియశ్వంత్ సిన్హా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానిఅటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షత వహించారు.
కాశ్మీర్లో కాల్పుల విరమణ పెద్దఫార్స్ అని పాకిస్థాన్ విమర్శించింది. కాశ్మీర్లో స్వాతంత్ర్యపోరాటయోధులపై దాడులు జరుగుతున్నాయని, చట్ట వ్యతిరేక హత్యలుజరుగుతున్నాయని పాకిస్థాన్ విమర్శించింది.
-
కాల్పులవిరమణకు
విపక్షాల
మద్దతు