వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవెగౌడ భార్యపై దాడి: న్యాయవిచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: మాజీ ప్రధాని దేవేగౌడ భార్యపై జరిగిన యాసిడ్‌ దాడిపై కర్ణాటక ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణతో గురువారం సమావేశమైన అనంతరం హోంమంత్రి మల్లికార్జున ఖార్గేవిలేకరులకు ఈ విషయం చెప్పారు. సిట్టింగ్‌ హైకోర్టు న్యాయమూర్తి చేతవిచారణ జరిపించనున్నట్లు
ఆయన తెలిపారు. త్వరలో మంత్రివర్గం సమావేశమైవిచారణ సంఘం నియమ నిబంధనలను, విచారణ పరిధిని ఖరారు చేస్తుందని ఆయన చెప్పారు.

దేవేగౌడ్‌ భార్య చెన్నమ్మపై బుధవారం రాత్రి యాసిడ్‌ దాడి జరిగింది. ఈ సంఘటన హసన్‌ జిల్లా హరదనహళ్లిలో జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా పూజలు చేయడానికి కోడలు భవానితో సహా వెళ్లిన చెన్నమ్మపై గౌడ సోదరుడి కుమారుడు లోకేష్‌ ఈ దాడి చేశాడు. లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాసిడ్‌ దాడిలో చెన్నమ్మతో పాటు ఆమె కోడలుస్వల్పంగా గాయపడ్డారు. ఈ దాడిపై విస్తృత దర్యాప్తునకు పోలీసు డిటెక్టివ్‌లను నియోగించినట్లు మల్లికార్జున ఖార్గే చెప్పారు.

దేవేగౌడ ఆక్షేపణ

తన భార్య చెన్నమ్మపై జరిగిన యాసిడ్‌ దాడిపై కర్ణాటక ప్రభుత్వంన్యాయవిచారణకు ఆదేశించడాన్ని మాజీ ప్రధాని దేవేగౌడఆక్షేపించారు. ఇంత మాత్రానికే న్యాయవిచారణ ఎందుకనిఆయన అడిగారు. తన భార్యపై దాడి జరగడంవెనుకు గల ఉద్దేశమేమిటో తనకు అర్థం కావడంలేదని ఆయన అన్నారు. యాసిడ్‌ దాడి చేసిన తనసోదరుడి కుమారుడ్ని శిక్షించవద్దని ఆయనకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X