వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాల్కోపైఅట్టుడికిన రాజ్యసభ
న్యూఢిల్లీ: విపక్షాల గొడవతో రాజ్యసభ గురువారంమధ్యాహ్నం భోజన విరామానంతరంసమావేశమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. 51 శాతం ప్రభుత్వ రంగ సంస్థఅయిన భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో) వాటాలను ప్రయివేట్ కంపెనీకివిక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేశాయి.వెల్లోకి దూసుకెళ్లాయి.
గురువారం ఉదయం నుంచి రాజ్యసభలో బాల్కోఅంశం కుదిపేస్తూ వచ్చింది. ఇదే అంశంపై విపక్షాలు ధ్వజమెత్తడంతోజీరో అవర్లో రెండు సార్లు సభ వాయిదా పడింది. బాల్కోవాటాల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం దాచి పెట్టిందనికాంగ్రెస్, సిపిఎం సభ్యులు ధ్వజమెత్తారు. ఈ విషయంపై శుక్రవారంచర్చకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదనిపెట్టుబడుల ఉససంహరణ మంత్రి అరుణ్ శౌరి ఇచ్చినహామీని ప్రతిపక్షాలు పట్టించుకోలేదు.
Comments
Story first published: Thursday, February 22, 2001, 23:53 [IST]