తెనాలిః గుంటూరు జిల్లా తెనాలిలోని సాయి రెసిడెన్షియల్కళాశాలలో గురువారం తెల్లవారు జామున ఇంటర్విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నపరెడ్డి అనే ఇంటర్ రెండోసంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి గురువారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మొదటి సంవత్సరంలో మార్కులు సరిగా రాకపోవడంతోనిరాశ నిస్పృహలకు లోనైన అన్నపరెడ్డి ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని భావిస్తున్నారు.విజయవాడ చైతన్య రెసిడెన్షియల్కళాశాలలో గత మాసంలో ముగ్గురు విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. రెసిడెన్షియల్ కళాశాలలయాజమాన్య వైఖరి, తమ పిల్లలు గొప్పవారుకావాలనే అత్యాశతో వారి మానసిక స్థితిని గుర్తించలేనితల్లిదండ్రుల దౌర్బల్యం కారణంగా ఇటువంటి ఆత్మహత్యలుజరుగుతున్నాయనే విమర్శలు వున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్నీరదా రెడ్డి సారధ్యంలో ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ కమిటీ నేడో రేపో ఇంటర్మీడియట్ బోర్డుకునివేదిక సమర్పించనుంది. ఈ లోగా తెనాలిలోమరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంసృష్టించింది.
తెనాలిః గుంటూరు జిల్లా తెనాలిలోని సాయి రెసిడెన్షియల్కళాశాలలో గురువారం తెల్లవారు జామున ఇంటర్విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నపరెడ్డి అనే ఇంటర్ రెండోసంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి గురువారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మొదటి సంవత్సరంలో మార్కులు సరిగా రాకపోవడంతోనిరాశ నిస్పృహలకు లోనైన అన్నపరెడ్డి ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని భావిస్తున్నారు.
విజయవాడ చైతన్య రెసిడెన్షియల్కళాశాలలో గత మాసంలో ముగ్గురు విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. రెసిడెన్షియల్ కళాశాలలయాజమాన్య వైఖరి, తమ పిల్లలు గొప్పవారుకావాలనే అత్యాశతో వారి మానసిక స్థితిని గుర్తించలేనితల్లిదండ్రుల దౌర్బల్యం కారణంగా ఇటువంటి ఆత్మహత్యలుజరుగుతున్నాయనే విమర్శలు వున్నాయి.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్నీరదా రెడ్డి సారధ్యంలో ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ కమిటీ నేడో రేపో ఇంటర్మీడియట్ బోర్డుకునివేదిక సమర్పించనుంది. ఈ లోగా తెనాలిలోమరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంసృష్టించింది.