వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర బడ్జెట్‌పైవైయస్‌ ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్నిఅప్పుల ఊబిలోకి నెడుతోందని ప్రతిపక్ష నేత డాక్టర్‌వై.యస్‌. రాజశేఖరరెడ్డి విమర్శించారు.బడ్జెట్‌పై ఆయన గురువారం శాసనసభలో మాట్లడుతూ రాష్ట్రప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు.

అప్పులతో అభివృద్ధిసాధిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పుతున్నారని, అయితే అభివృద్ధిరవ్వంత కూడా జరగలేదని ఆయన అన్నారు.సాధించిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అప్పులు తెచ్చి అభివృద్ధిసాధిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రభత్వ దివాళాకోరు తనానికినిదర్శనమని ఆయన అన్నారు.

రాష్ట్రప్రభుత్వం ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీరంగంతో సహా అన్ని రంగాల్లో తిరోగమన దిశలోపయనిస్తోందని ఆయన విమర్శించారు. బడ్జెట్‌లో ప్రభుత్వం రైతులను గాలికివదిలేసిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు విదేశాలను చుట్టిరావడమే మినహా ఒక్క పైసా కూడా పెట్టుబడులరూపంలో రాలేదని ఆయన అన్నారు. దీనికి తోడు ప్రభుత్వ రంగ సంస్థలనుఅన్నింటినీ ఒక్కొక్కదాన్నే ప్రయివేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్నారనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X