వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని శాసనసభలకు జరిగినఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది.పది సీట్లలకు గాను జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)భాగస్వామ్య పక్షాలు ఏడు సీట్లు గెల్చుకున్నాయి.

చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి అజిత్‌ జోగీ మర్వాహీనియోజక వర్గం నుంచి, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరండీరామ్‌ఘర్‌ నియోజకవర్గం నుంచి విజయంసాధించారు. అజిత్‌ జోగీ తన సమీప బిజెపి ప్రత్యర్థిఅమర్‌సింగ్‌పై 50 వేల మెజారిటీతో గెలుపొందారు. మరండీ తన సమీప సిపిఐ ప్రత్యర్థినదీరా బేగంపై 20 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతోవిజయం సాధించారు.

దేశంలోనితొమ్మిది రాష్ట్రాల్లో 12 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 19వ తేదీన పోలింగ్‌జరిగింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి మూడుసీట్లు, తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు, శిరోమణిఅకాలీదళ్‌కు ఒక సీటు వచ్చాయి. బహుజన సమాజ్‌పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు ఉత్తరప్రదేశ్‌లో ఒక్కటేసినియోజకవర్గాల్లో విజయం సాధించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X