వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐ.టి. గేట్ వే గా హైదరాబాద్
హైదరాబాద్ః ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరమైన హైదరాబాద్ ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ వేగా రూపొందించనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ హామీ ఇచ్చారు. శుక్రవారం మాదాపూర్ లోని హైటెక్ సిటీలో ఒక శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ ను ఐ.టి. హైవే గా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఈ ఏడాది మార్చి నాటికి అడిగిన వెంటనే టెలిఫోన్ మంజూరు చేస్తామనిపాశ్వాన్ ప్రకటించారు. ఇ.టి. రంగంలో ఆంధ్ర ప్రదేశ్ సాధించిన ప్రగతి హర్షణీయమని, ఈ నగరాన్ని ఐ.టి. రంగంలో మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి పూర్తి సాయంఅందిస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, February 23, 2001, 23:53 [IST]