భారీ సంస్కరణలకు సర్వే పిలుపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆర్ధిక విధానాల్లో భారీ మార్పులకు ఆర్థిక సర్వే పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2001-2002 సంవత్సరానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు ముందుగా దేశ ఆర్ధిక పరిస్థితిని సమీక్షిస్తూ ప్రవేశపెట్టిన ఈ సర్వేలో, ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అదే
విధంగాసబ్సిడీల్లో
కోతపెట్టాలని,
రెంట్
కంట్రోల్
చట్టాన్ని
ఎత్తివేయాలని,
చిన్నపరిశ్రమల
రిజర్వేషన్
విధానానికి
స్వస్తిపలకాలని,
అనవసరమైన
ప్రభుత్వ
విభాగాలను,
మంత్రిత్వశాఖలను
ఎత్తివేయాలని
పిలుపునిచ్చారు.
చిన్నమొత్తాల
పొదుపుపై
వడ్డీ
రేట్లను
తగ్గించే
అవకాశం
వున్నట్టుగా
కూడా
ఈ
సర్వే
సూచనప్రాయంగా
వెల్లడించింది.
శుక్రవారం
నాడు
పార్లమెంట్లో
ఆర్ధిక
మంత్రి
యశ్వంత్
సిన్హా
సర్వేను
పార్లమెంట్లో
ప్రవేశపెట్టారు.
రెండో విడత ఆర్ధిక సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వ పథకాలను విస్పష్టంగా ఈ సర్వేలో ఆయన సూచించారు. ప్రస్తుతం దేశంలో అమల్లో వున్న కస్టమ్స్ సుంకాలు ప్రపంచంలో అన్ని దేశాలకంటే హెచ్చు రేట్లతో వున్నాయని వీటిని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం వుందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో పాటు పన్నుల పరిధిని మరింత విస్తరించాల్సిన అవసం వున్నదని సర్వే పేర్కొంది. సర్వేలో పేర్కొన్న అంశాలను బట్టి ఈ సారి బడ్జెట్లో సర్వీసులను కూడా బడ్జెట్ పరిధిలోకి తెచ్చే అవకాశం వుంది.
వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం వున్నట్టుగా కూడా సర్వేలో సూచించారు. చిన్న తరహా పొదుపుమొత్తాలపై చెల్లించే వడ్డీరేట్లను అవే తరహా ఇతర ఇన్స్ట్రుమెంట్స్తో సమానంగా వుండేట్టుగా చూడాలని కూడా సర్వే సూచించింది. అంటే ఈ రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం వుంది. కార్మిక చట్టాల్లో మార్పులను కూడా సర్వే ఆకాంక్షించింది. సర్వేలో సూచించిన ప్రకారం స్థూల విత్తలోటు జీడీపీలో 5.5 శాతం వుంది. గత బడ్జెట్లో అంచనా వేసిన 5.1 శాతం కంటే ఇది అధికం. 2000-2001 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు అంతకు ముందు ఏడాది కంటే స్వల్పంగా తక్కువగా 6 శాతం మాత్రమే వుంది.