తిరుపతి: బాలింతలకు అత్యవసరసమయాల్లో ఇచ్చే నకిలీ ఇంజెక్షన్లనుతయారు చేస్తున్న ముఠా సూత్రాధారిని తిరుపతి రూరల్ పోలీసులు శనివారంఅరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ ఇంజక్షన్లనుతయారు చేసి తమిళనాడులోనూ, ఆంధ్రప్రదేశ్లోనివిజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ఇతరనగరాల్లో, పట్టణాల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులుచెప్పారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నుంచి చిత్తూరు జిల్లాచంద్రగిరికి వస్తున్న ఒక వాహనాన్ని పోలీసులుఅనుమానంతో ఆపి తనిఖీ చేశారు. తమిళనాడు సరిహద్దుల్లో గల ఒకమందుల తయారీ సంస్థ లేబుళ్లతో వున్న ఇంజక్షన్లునకిలీవని అనుమానం రావడంతో డ్రగ్స్ ఇన్స్పెక్టర్నుపిలిచారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ వాటిని నకిలీ ఇంజక్షన్లుగా తేల్చడంతోశ్రవణన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్లుగా ఈ ముఠా నకిలీ ఇంజక్షన్లనుతయారు చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.శ్రవణన్ను అరెస్టు చేయడంతో సిబిసిఐడిఅధికారులు దర్యాప్తునకు తిరుపతి వచ్చారు.శ్రవణన్ వద్ద కీలకమైన ఆధారాలు లభించడంతోనకిలీ ఇంజక్షన్లను తయారు చేస్తున్న ప్రాంతాన్ని గుర్తించడం వీలవుతుందని సిబిసిఐడిఅధికారులు భావిస్తున్నారు. ఈ ముఠా తమిళనాడులో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.కాగా, ఈ ముఠాకు తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీఅండదండలున్నాయని అనుమానిస్తున్నారు.
తిరుపతి: బాలింతలకు అత్యవసరసమయాల్లో ఇచ్చే నకిలీ ఇంజెక్షన్లనుతయారు చేస్తున్న ముఠా సూత్రాధారిని తిరుపతి రూరల్ పోలీసులు శనివారంఅరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ ఇంజక్షన్లనుతయారు చేసి తమిళనాడులోనూ, ఆంధ్రప్రదేశ్లోనివిజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ఇతరనగరాల్లో, పట్టణాల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులుచెప్పారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నుంచి చిత్తూరు జిల్లాచంద్రగిరికి వస్తున్న ఒక వాహనాన్ని పోలీసులుఅనుమానంతో ఆపి తనిఖీ చేశారు.
తమిళనాడు సరిహద్దుల్లో గల ఒకమందుల తయారీ సంస్థ లేబుళ్లతో వున్న ఇంజక్షన్లునకిలీవని అనుమానం రావడంతో డ్రగ్స్ ఇన్స్పెక్టర్నుపిలిచారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ వాటిని నకిలీ ఇంజక్షన్లుగా తేల్చడంతోశ్రవణన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండేళ్లుగా ఈ ముఠా నకిలీ ఇంజక్షన్లనుతయారు చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.శ్రవణన్ను అరెస్టు చేయడంతో సిబిసిఐడిఅధికారులు దర్యాప్తునకు తిరుపతి వచ్చారు.శ్రవణన్ వద్ద కీలకమైన ఆధారాలు లభించడంతోనకిలీ ఇంజక్షన్లను తయారు చేస్తున్న ప్రాంతాన్ని గుర్తించడం వీలవుతుందని సిబిసిఐడిఅధికారులు భావిస్తున్నారు. ఈ ముఠా తమిళనాడులో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.కాగా, ఈ ముఠాకు తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీఅండదండలున్నాయని అనుమానిస్తున్నారు.