హైదరాబాద్: రాష్ట్రాల్లోఅమలు చేస్తున్న కేంద్ర పథకాలను రద్దుచేయాలనడం సరి కాదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు అన్నారు. పథకాలనురద్దు చేస్తే ఇక కేంద్ర అవసరమేమిటని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అడిగారు. కేంద్రపథకాలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రియనమల రామకృష్ణుడు ఇటీవల అభిప్రాయపడినవిషయం తెలిసిందే. కేంద్ర పథకాలనురద్దు చేయాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఅభిప్రాయం సరైంది కాదని వెంకయ్య నాయుడుఅన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా తమ ప్రభుత్వహయాంలో పెరిగిందని, ఇది 27 శాతం నుంచి 29 శాతానికిపెరిగిందని ఆయన చెప్పారు. కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపదే పదే కోరుతోంది. దీన్ని ప్రస్తావిస్తూ వెంకయ్యనాయుడు ఆవిధంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితేకాదు, అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందనిఆయన అన్నారు. ద్రవ్యలోటు పెరిగిందని అంటూదీన్ని అందరూ సమష్టిగా ఎదుర్కోవాలని ఆయనసూచించారు.
హైదరాబాద్: రాష్ట్రాల్లోఅమలు చేస్తున్న కేంద్ర పథకాలను రద్దుచేయాలనడం సరి కాదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు అన్నారు. పథకాలనురద్దు చేస్తే ఇక కేంద్ర అవసరమేమిటని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అడిగారు. కేంద్రపథకాలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రియనమల రామకృష్ణుడు ఇటీవల అభిప్రాయపడినవిషయం తెలిసిందే. కేంద్ర పథకాలనురద్దు చేయాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఅభిప్రాయం సరైంది కాదని వెంకయ్య నాయుడుఅన్నారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా తమ ప్రభుత్వహయాంలో పెరిగిందని, ఇది 27 శాతం నుంచి 29 శాతానికిపెరిగిందని ఆయన చెప్పారు. కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపదే పదే కోరుతోంది. దీన్ని ప్రస్తావిస్తూ వెంకయ్యనాయుడు ఆవిధంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితేకాదు, అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందనిఆయన అన్నారు. ద్రవ్యలోటు పెరిగిందని అంటూదీన్ని అందరూ సమష్టిగా ఎదుర్కోవాలని ఆయనసూచించారు.