న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరభారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నాడు భూమి తీవ్రంగా కంపించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం తీవ్రత ఎక్కువగా వున్నట్టుగా సమాచారం అందింది. గుజరాత్లో బీభత్సం సృష్టించిన జనవరి 26నాటి భూకంపం తీవ్రత గుర్తుకొచ్చిన జనం భయంతో ఇళ్లు వదలి రోడ్లపైకి పరుగెత్తుకొచ్చారు. ఉదయం 7.50-8.00 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించిందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. రిక్టార్ స్కేల్పై భూకంపం తీవ్రత అయిదు పైగా వున్నట్టు తెలిసింది.ఈ భూకంపానికి కేంద్ర స్థానం ఆఎn్టానిస్తాన్ సరిహద్దుల్లో వున్నట్టుగా చెబుతున్నారు. పాకిస్తాన్లో కూడా ఈ భూకంపం ప్రభావం వుంది. తీవ్రత ఎక్కువగానే వున్నట్టుగా ఈ భూకంపం వల్ల నష్టం జరిగినట్టుగా మాత్రం వార్తలు రాలేదు. రాజస్తాన్లోని జైపూర్, ఆజ్మీర్ల్లోనూ, పంజాబ్, హర్యానాలోని అనేక ప్రాంతాల్లోనూ భూకంపం ప్రభావం కనిపించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరభారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నాడు భూమి తీవ్రంగా కంపించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం తీవ్రత ఎక్కువగా వున్నట్టుగా సమాచారం అందింది.
గుజరాత్లో బీభత్సం సృష్టించిన జనవరి 26నాటి భూకంపం తీవ్రత గుర్తుకొచ్చిన జనం భయంతో ఇళ్లు వదలి రోడ్లపైకి పరుగెత్తుకొచ్చారు. ఉదయం 7.50-8.00 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించిందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. రిక్టార్ స్కేల్పై భూకంపం తీవ్రత అయిదు పైగా వున్నట్టు తెలిసింది.
ఈ భూకంపానికి కేంద్ర స్థానం ఆఎn్టానిస్తాన్ సరిహద్దుల్లో వున్నట్టుగా చెబుతున్నారు. పాకిస్తాన్లో కూడా ఈ భూకంపం ప్రభావం వుంది. తీవ్రత ఎక్కువగానే వున్నట్టుగా ఈ భూకంపం వల్ల నష్టం జరిగినట్టుగా మాత్రం వార్తలు రాలేదు. రాజస్తాన్లోని జైపూర్, ఆజ్మీర్ల్లోనూ, పంజాబ్, హర్యానాలోని అనేక ప్రాంతాల్లోనూ భూకంపం ప్రభావం కనిపించింది.