వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్: వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా చిన్న పరిశ్రమలను గ్రామాల్లో ప్రొత్సహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నమాట నిజమేనని ఆయన అన్నారు.
అయితే మునుముందు కూడా అలాంటి పరిస్థితి వుండదని, ప్రజలు జీవిక కోసం గ్రామాలను వదిలి పట్టణప్రాంతాలకు వలస వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వున్నదని ఆయన చెప్పారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థలో జరిగిన ఒక సదస్సులో ఆదివారం నాడు ఆయన ప్రసంగించారు.
గ్రామాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రొత్సహించాల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు. వీటి వల్ల గ్రామీణ ప్రాంతాలనుంచి వలసను నిరోధించవచ్చని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణానికి విరివిగా కేంద్రం రుణాలను అందజేస్తుందని ఆయన చెప్పారు. వ్యవసాయఉత్పత్తుల నిల్వవిషయంలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, February 25, 2001, 23:53 [IST]