ఆంధ్రపై నామమాత్రం మమత
న్యూఢిల్లీ: రైల్వేబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దగా ప్రాజెక్టులురాలేదు. దేశవ్యాప్తంగా 24 కొత్త రైళ్లనుప్రవేశపెట్టగా రాష్ట్రానికి ఒకటి, రెండు రైళ్లను మాత్రమేకేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కోరిన పలు టూరిస్టురైళ్లను, ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును పరిశీలిస్తామని మాత్రమేరైల్వే మంత్రి మమతా బెనర్జీ తన రైల్వేబడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. సికింద్రాబాద్-పుట్టపర్తిరైలు మార్గంలో కొత్త టూరిస్టు రైలుప్రతిపాదనను పరిశీలిస్తామని ఆమె చెప్పారు.
దర్మవరం- సికింద్రాబాద్మార్గంలో కొత్త రైలును ప్రవేశపెడతారు.సికింద్రాబాద్- ఢిల్లీల మధ్య నడిచే రాజధానిఎక్స్ప్రెస్ ఇక నుంచి రెండు రోజులకొకసారి నడుస్తుంది. ఇంకా ఒకటి అరామినహాయిస్తే పెద్దగా ఆంధ్రకు మేలుజరగలేదు. రెండు కొత్త రైలు సర్వీసు పనులకు మమతఆదేశించారు. ధర్మవరం-పెనుకొండ రైలు మార్గాన్ని పూర్తిచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. గేజ్ మార్పిడివంటి పనులను మాత్రమే రాష్ట్రంలోచేపట్టే ప్రతిపాదనలు బడ్జెట్లో వున్నాయి.
ఇదిలా వుండగా, రైల్వేబడ్జెట్ పట్ల తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు.అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదనిఆయన అన్నారు.