రైల్వే ఛార్జీలపెంపు తప్పదు?
న్యూఢిల్లీ: ఈ ఆర్థికసంవత్సరంలో ఏ సమయంలోనైనా రైలు ప్రయాణికుల ఛార్జీలనుపెంచే విషయాన్ని తోసిపుచ్చలేమని రైల్వే బోర్గుచైర్మన్ అశోక్ కుమార్ సోమవారం అన్నారు. రైలు ఛార్జీల మోత లేకుండారైల్వే మంత్రి మమత బెనర్జీ బడ్జెట్నుప్రవేశపెట్టిన నేపథ్యంలో అశోక్ కుమార్ ఈ ప్రకటనచేయడం గమనార్హం. రైలు ప్రయాణికుల ఛార్జీలను ఏసమయంలోనైనా సమీక్షించే అవకాశం వున్నదనిఆయన చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలుముగిసిన వెంటనే రైల్వే ఛార్జీలను పెంచేఅవకాశం వున్నదా అని విలేకరులు ప్రశ్నిస్తే తాను జోతిష్కుడిని కానని మాత్రమేఅశోక్ కుమార్ జవాబిచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసేలక్ష్యంతోనే ఈ బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులనుప్రతిపాదించలేదని ఆయన చెప్పారు. సంప్రదాయేతర క్షేత్రాలనుంచి రెవెన్యూను రాబట్టుకునే ఉద్దేశంతో టూరిజంప్యాకేజీలు, అడ్వర్టయిజ్మెంట్ క్యాటరింగ్ వంటి ప్రాజెక్టులకు ఏకగవాక్ష విధానం ద్వారాఆమోదం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.