బాల్కో వాటాల బదలాయింపు వాయిదా
న్యూఢిల్లీ: భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో) వాటాల బదలాయింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 1వ తేదీ వరకు వాయిదా వేసింది. బాల్కోలోని 51 శాతం వాటాలను స్టెరిలైట్కు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా వ్యతిరకేత ఎదురవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ చెప్పారు. బాల్కో వాటాలను స్టెరిలైట్కు బదలాయించాలనే నిర్ణయంలో ఏ విధమైన మతలబు లేదని ఆయన అన్నారు. నిర్ణయంలో ఏ విధమైన దాపరికం లేదని ఆయన చెప్పారు.
బాల్కో
వాటాల
బదలాయింపు
నిర్ణయంపై
రైల్వే
బడ్జెట్
ప్రతిపాదనకు
ముందు
లోకసభలో
విపక్షాలు
ధ్వజమెత్తాయి.
కాంగ్రెస్,
సమాజ్వాదీ
పార్టీ,
రాష్ట్రీయ
జనతాదళ్
సభ్యులు
ప్రభుత్వ
నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ
ప్రధాని
అటల్
బిహారీ
జవాబు
కోసం
పట్టుబట్టారు.
విపక్షాల
సభ్యులు
వెల్లోకి
దూసుకెళ్లి
నినాదాలు
చేశారు.
సభ
సద్దుమణగక
పోవడంతో
స్పీకర్
జి.ఎం.సి.
బాలయోగి
సభను
వాయిదా
వేశారు.