క్రికెట్ భీష్ముడు బ్రాడ్మన్ మృతి
సిడ్నీః ప్రపంచ క్రికెట్ రంగంలో చిరస్మరణీయుడు సర్ డాన్ బ్రాడ్ మన్ ఆదివారం కన్నుమూశారు. 92 ఏళ్ళ బ్రాడ్ మన్ అడిలైడ్ లో కన్నుమూసినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు దశాబ్దాలపాటు బౌలర్లకు నిద్రలేకుండా చేసిన బ్రాడ్ మన్ ఆదివారం రాత్రి నిద్రలోనే కన్నుమూశారు.
1927లో సిడ్నీలో తొలి టెస్ట్ ఆడిని బ్రాడ్ మన్ 52 టెస్టుల్లో 6,996 పరులుగు చేశారు. నభూతో న భవిష్యతి అన్న చందంగా 99.94 శాతం సగటు పరుగులతో ఆయన సృష్టించిన రికార్డును బద్దలు కొట్టడం అసాధం. బ్రాడ్ మన్ సతీమణి జెస్సీ నాలుగేళ్ళ క్రితం మరణించింది. ఆయనఏకైక కుమారుడు జాన్ బ్రాడ్ మన్. బ్రాడ్ మన్ మృతికి ప్రపంచ క్రికెట్ ప్రముఖులు ఘనంగా నివాళులుఅర్పించారు. బ్రాడ్ మన్ ను ఆస్ట్రేలియా ఆణిముత్యంగా వారు అభివర్ణించారు.
టెస్టుల్లో
ఆయన
సాధించిన
రికార్డు
సునీల్
గవాస్కర్,
గారీ
సోబర్స్,
బ్రియాన్
లారా,
సచిన్
టెండుల్కర్
సాధించిన
సగటు
కంటే
సగానికిపైగానే
వుంటుంది.
1948లో
బ్రాడ్
మన్
ఆడిన
చివరి
టెస్టుల్లో
ఆయన
జీరో
పరుగులకే
అవుటయ్యాడు.
లేకుంటే
టెస్టుల్లో
నూరుశాతం
సగటు
సాధించే
అద్భుతం
జరిగివుండేది.
ప్రపంచ
క్రికెట్
లో
ఎన్నో
అద్భుతాలు
చేసిన
బ్రాడ్
మన్
ప్రచారానికి
చాలా
దూరంగా
వుండే
వారు.
ఇటీవల
బ్యాటింగ్
లో
యువసంచలనాలైన
టెండుల్కర్,
బ్రియాన్
లారాలను
ఆయనస్వయంగా
పిలుపించుకొని
ఆదరించారంటే
ఆయనకు
క్రికెట్
పట్ల
గల
అభిమానాన్ని,
ఆయన
వ్యక్తిత్వాన్నిఅర్థం
చేసుకోవచ్చు.