వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చార్జీల మోత లేని రైల్వై బడ్జెట్
న్యూఢిల్లీ: ఇచ్చిన హామీల మేరకు ప్రయాణికులపై ఎలాంటి భారం మోపకుండా కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ 2001-2002 సంవత్సరం రైల్వే బడ్జెట్ను సోమవారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ముందునుంచి సూచిస్తున్నట్టుగానే రవాణాపై మాత్రం భారం మోపారు.
రైల్వే రవాణా చార్జీలను మాత్రం 3 శాతం హెచ్చిస్తూ ఆమె ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ చార్జీల్లోంచి కూడా యూరియా వంటి ముఖ్యమైన సరకులకు మినహాయింపు ఇచ్చారు. కొత్తగా 24 రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టుగా వెళ్లడించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాయితీలను ఆమె ప్రకటించారు. సికింద్రాబాద్నుంచి నడికుడి, గుంటూరు, తిరుపతి మీదుగా పుట్టపర్తికి టూరిస్ట్ రైల్ను ప్రవేశపెట్టనున్నట్టుగా ఆమె వెల్లడించారు.
Comments
Story first published: Monday, February 26, 2001, 23:53 [IST]