వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కానిస్టేబుల్‌ నిర్లక్ష్యంతోనే ఈఘోరం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హెడ్‌ కానిస్టేబుల్‌ నిర్లక్ష్యం కారణంగానే కరీంనగర్‌ లోఘోర దుర్ఘటన సంభవించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారంఅసెంబ్లీలో వెల్లడించారు. ఈ విషయంపై విచారణ జరిపించి దోషుల్ని శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 90 శాతం కాలినగాయాలతో నిమ్స్‌ లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం పూర్తి ఖర్చులు భరించి చికిత్స చేయిస్తుందని ఆయన ప్రకటించారు. దుర్ఘటనపై హోం మంత్రి దేవేందర్‌ గౌడ్‌అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని బాధితుల్ని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు.

నిమ్స్‌ కు వెళ్ళిన బాబు
కరీంనగర్‌ పేలుడులో 90శాతం గాయాలకు లోనే నిమ్స్‌ లో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం పరామర్శించారు. 90 శాతం కాలిన గాయాలతో విలవిలలాడి పోతున్న చిన్నారులను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చుకు వెనుకాడకుండా వారికి అధునాతన వైద్యంఅందచేయాల్సిందిగా చంద్రబాబు డాక్టర్లను ఆదేశించారు.
బాధితుల ఆక్రందనలు, బాధితుల బంధువుల రోదనలతో నిమ్స్‌ లోవిషాద ఛాయలు అలముకున్నాయి. బాధితుల బంధువులు తమ బిడ్డల్ని కాపాడాల్సిందిగా చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X