హైదరాబాద్ః యు.టి.ఐ-జిటిబి తోకుదుర్చుకున్న ఒప్పందంలో ఎటువంటి దాపరికంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చినదృష్ట్యా కమర్షియల్ పన్నుల వసూళ్ళ బాధ్యతనుజిటిబితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయనచెప్పారు. ఇందులో అవినీతి జరిగిందనేఆరోపణలలో అర్థం లేదని ఆయన చెప్పారు. ఒకవెబ్ సైట్ లో రాసిన వ్యాసం ఆధారంగా తనపై వ్యక్తి గత ఆరోపణలుచేయడం సమంజసం కాదని ఆయన చెప్పారు.వైబ్ సైట్ ఎవరైనా పెట్టుకోవచ్చు..........ఏమైనారాసుకోవచ్చు........ వాటిని నియంత్రించేందుకుకానీ, చట్టపరమైన చర్య తీసుకొనేందుకుఅవకాశం లేదు. అటువంటి వెబ్ సైట్ల రాతలను ఎలావిశ్వాసంలోకి తీసుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.తనపై ఆరోపణలు చేస్తున్నవై.ఎస్. చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుననిఆయన విమర్శించారు. వై.ఎస్. ను సొంత పార్టీ వారేవిశ్వసించరని ఆయన ఎద్దేవా చేశారు. వై.ఎస్. ఎన్నికలకుముందు కోట్ల రూపాయల ముడుపులు దండుకున్నారంటూ పత్రికలలోవచ్చిన వార్తలను ఆయన సభకు చదివి వినిపించారు.వై.ఎస్. తనపై వ్యక్తిగతంగా కక్ష సాధించేందుకేసుప్రీంకోర్టులో కేసులు వేయబోయి భంగపడ్డారనిచంద్రబాబు విమర్శించారు. నేను మధ్యతరగతిమనిషి కుటుంబం నుంచి వచ్చాను..... నా కుటుంబం ఒకపద్ధతి ప్రకారం వుంది......వై.ఎస్. కుటుంబం ఎలాఎదిగిందో...అందరికీ తెలుసు అని చంద్రబాబు ప్రత్యారోపణలుచేశారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపూఅధికార పక్ష సభ్యులు హర్షధ్వానాలుచేస్తునే వున్నారు.తనకు ఆదాయం మించి ఒక్క పైసాఆదాయం వున్నా ఆ డబ్బునంతా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు రాసిస్తాననిఆయన చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి కోసం తాను చేసిన పనిని ఇలా తప్పుపట్టడంవిచారకరమని చంద్రబాబు చెప్పారు.
హైదరాబాద్ః యు.టి.ఐ-జిటిబి తోకుదుర్చుకున్న ఒప్పందంలో ఎటువంటి దాపరికంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చినదృష్ట్యా కమర్షియల్ పన్నుల వసూళ్ళ బాధ్యతనుజిటిబితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయనచెప్పారు. ఇందులో అవినీతి జరిగిందనేఆరోపణలలో అర్థం లేదని ఆయన చెప్పారు. ఒకవెబ్ సైట్ లో రాసిన వ్యాసం ఆధారంగా తనపై వ్యక్తి గత ఆరోపణలుచేయడం సమంజసం కాదని ఆయన చెప్పారు.వైబ్ సైట్ ఎవరైనా పెట్టుకోవచ్చు..........ఏమైనారాసుకోవచ్చు........ వాటిని నియంత్రించేందుకుకానీ, చట్టపరమైన చర్య తీసుకొనేందుకుఅవకాశం లేదు. అటువంటి వెబ్ సైట్ల రాతలను ఎలావిశ్వాసంలోకి తీసుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తనపై ఆరోపణలు చేస్తున్నవై.ఎస్. చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుననిఆయన విమర్శించారు. వై.ఎస్. ను సొంత పార్టీ వారేవిశ్వసించరని ఆయన ఎద్దేవా చేశారు. వై.ఎస్. ఎన్నికలకుముందు కోట్ల రూపాయల ముడుపులు దండుకున్నారంటూ పత్రికలలోవచ్చిన వార్తలను ఆయన సభకు చదివి వినిపించారు.వై.ఎస్. తనపై వ్యక్తిగతంగా కక్ష సాధించేందుకేసుప్రీంకోర్టులో కేసులు వేయబోయి భంగపడ్డారనిచంద్రబాబు విమర్శించారు. నేను మధ్యతరగతిమనిషి కుటుంబం నుంచి వచ్చాను..... నా కుటుంబం ఒకపద్ధతి ప్రకారం వుంది......వై.ఎస్. కుటుంబం ఎలాఎదిగిందో...అందరికీ తెలుసు అని చంద్రబాబు ప్రత్యారోపణలుచేశారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపూఅధికార పక్ష సభ్యులు హర్షధ్వానాలుచేస్తునే వున్నారు.
తనకు ఆదాయం మించి ఒక్క పైసాఆదాయం వున్నా ఆ డబ్బునంతా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు రాసిస్తాననిఆయన చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి కోసం తాను చేసిన పనిని ఇలా తప్పుపట్టడంవిచారకరమని చంద్రబాబు చెప్పారు.