బాల్కోపైఇరకాటంలో బిజెపి
న్యూఢిల్లీ: భారత్ అల్యూమినయం కంపెనీ(బాల్కో) వాటాల అమ్మకంపై బిజెపి సంకీర్ణ ప్రభుత్వంఇరకాటంలో పడింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డి) పక్షాలు కూడా వ్యతిరేకిస్తుండడంతో బిజెపి చిక్కులనుఎదుర్కునే పరిస్థితి వచ్చింది. బాల్కోలోని వాటాలఅమ్మకాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ వ్యతిరేకిస్తోంది. దీనిపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీనివేయాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడుసి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
ఇక, శివసేన, యునైటెడ్జనతాదళ్ (యుజెడి)లు ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకంగాశంకిస్తున్నాయి. బాల్కో వాటాల విక్రయం అనాలోచితచర్య అని శివసేన అధినేత బాల్ థాకరే అన్నారు. బాల్కోవాటాల అమ్మకాన్ని యుజెడి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లాభాలబాటలో వున్న కంపెనీని విక్రయించడం తగదని యుజెడిఅంటోంది. బాల్కో వాటాల విక్రయాన్నివ్యతిరేకించేందుకు తాము ఎంత దూరమైనా పోతామని యుజెడిచెప్పింది.
బాల్కో వాటాల విక్రయం వెనుక మతలబువున్నదని సిపిఎం ఆరోపించింది. బాల్కో వాటాల విక్రయంలోవెనక్కి తగ్గే ప్రసక్తి లేదని బిజెపి పట్టుబట్టికూర్చుంది. ఈ వ్యవహారంపై పార్లమెంటులో 184వ నిబంధనకింద చర్చ జరుగుతోంది.
బాల్కో వాటాల విక్రయంపై రగడ జరుగుతుండడంతో దీనిపై చర్చించడానికి బిజెపి పార్లమెంటరీ పార్టీ అత్యవసరంగాసమావేశమైంది. బాల్కో వాటాల విక్రయంపైఅన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని బిజెపి నేతమల్హోత్రా అన్నారు.
ఈ సమావేశానికితెలుగుదేశం పార్టీ మినహా మిత్రపక్షాలన్నీహాజరయ్యాయని ఆయన చెప్పారు. ఈ విషయంపై తమసలహాలను తర్వాత అందించామనితెలుగుదేశం ఆ తర్వాత తెలియజేసినట్లుఆయన తెలిపారు.