వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైల్వేబడ్జెట్పై దేశం అసంతృప్తి
హైదరాబాద్: రైల్వేబడ్జెట్పై తెలుగుదేశం తన అసంతృప్తినివ్యక్తం చేసింది. రాష్ట్రానికి చెందిన రైల్వే ప్రాజెక్టులకుబడ్జెట్లో అరకొర నిధులే కేటాయించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రికె. విజయరామారావు మంగళవారం విలేకరులసమావేశంలో అన్నారు.
హైదరాబాద్లో తలపెట్టినమల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్కునిధులు కేటాయించకపోవడం పట్ల ఆయన అసంతృప్తివ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంసూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీబడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆయనఅన్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి మమతా బెనర్జీదృష్టికి తేనున్నట్లు ఆయన తెలిపారు.
గుంటూరు-రేణిగుంట రైలుమార్గానికి అరకొర నిధులు కేటాయించడం పట్లుఆయన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనిరైల్వే లైన్ల గేజ్ మార్పిడికి, విద్యుదీకరణకు జరిగిననిధుల కేటాయింపు పట్ల కూడా ఆయన అసంతృప్తివ్యక్తం చేశారు.
Comments
Story first published: Tuesday, February 27, 2001, 23:53 [IST]