వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిన్హా బడ్జెట్‌కు వాజ్‌పేయి కితాబు Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి యశ్వంత్‌ సిన్హా బుధవారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2001-2002 వార్షిక బడ్జెట్‌ సత్వర అభివృద్ధికి ఊతం ఇచ్చే విధంగా వున్నదని ప్రధాని వాజ్‌పేయి శ్లాఘించారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రజా వ్యతిరేకంగా వుంటాయనే భయాలను తన ప్రతిపాదనలతో సిన్హా పటాపంచలు చేశారని ఆయన చెప్పారు.

ఎంతో దూరదృష్టితో రూపొందించిన ఈ బడ్జెట్‌ దేశాభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆర్ధికమంత్రిని ఆయన అభినందించారు. విభిన్న ఆర్ధిక రంగాలకు సంబంధించి ఆర్ధిక మంత్రి విభిన్న ప్రతిపాదనలు చేశారని ముఖ్యంగా రైతుల సమస్యల పరిష్కారానికి ఎన్నో చర్యలను ప్రతిపాదించారని ఆయన చెప్పారు.

ప్రపంచవాణిజ్య సంస్థ వల్ల రైతుల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోనున్నారని ఈ సమస్యలను అధిగమించడానికే అనేక వ్యవసాయఉత్పత్తుల దిగుమతి పై కస్టమ్స్‌ సుంకాలను పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులు ఇక భయపడాల్సింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఇప్పటికే తగ్గుముఖం పడుతున్న దారిద్ర్యం సిన్హా ప్రతిపాదనల వల్ల మరింత తగ్గుతుందని ఆయన చెప్పారు. ఎల్‌టిసిని రెండేళ్ల పాటు రద్దు చేయడం ప్రభుత్వ ఉద్యోగులకు బాధ కలిగించినా వేతన సవరణ వల్ల లబ్ధిపొందిన విషయం గమినించి వారు ఈ చిన్న నష్టాన్ని తట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

  • బడ్జెట్‌200-2002 విశేషాలు
  • సగటు జీవికి ఊరట-సంస్కరణలకు ఊతం
  • ఉరకలెత్తిన స్టాక్‌మార్కెట్‌
  • పోస్టల్‌రేట్లు భారీగా పెంపు
  • ఐటి ప్రాడక్ట్స్‌ మరింత చౌక
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X