ఉరకలెత్తిన స్టాక్మార్కెట్
ముంబాయి: కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా 2001-2002 ఆర్ధిక సంవత్సరానికి బుధవారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్దెట్ స్టాక్మార్కెట్లలో ఉత్సాహాన్ని కలిగించింది. సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 సమయానికి 177 పాయింట్ల రికార్డు స్థాయి పెరుగుదలను చూసింది. చాలా కాలం తర్వాత సాఫ్ట్వేర్ స్టాక్స్లో హడావుడి ముమ్మరంగా సాగింది. హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్, గ్లోబల్, సిల్వర్లైన్ 16 శాతం గరిష్టస్థాయి పెరుగుదలను చూశాయి. ఇన్ఫోసిస్, సత్యం కంప్యూటర్స్, డిజిటల్ ఎక్విప్మెంట్, డిఎస్క్యూ సాఫ్ట్, పెంటామీడియా 11 శాతం మేరపెరుగుదలను చూశాయి.
పాతతరం షేర్లలో హెచ్ఎల్ఎల్, ఐసిఐసిఐ, ఎస్బిఐ, టాటా టీ, టివిఎస్ సుజుకి, గ్రాసిం, ఎంఅండ్ఎం, నెస్లే, హీరోహోండా, ఐసిఐసిఐ బ్యాంక్, బిపిసిఎల్ చెప్పుకోదగిన స్థాయిలో లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో 4247 వద్ద ముగియగా, నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 1356 వద్ద క్లోజయింది.
హిమాచల్, సత్యం, రిలయన్స్, విప్రో చురుగ్గా ట్రేడయ్యాయి. ఆప్టెక్, రిలయన్స్ కాపిటల్, జీ టెలీ, ఎన్ఐఐటి, బాంక్ ఆఫ్ బరోడా కూడా పెరుగుదలను చూశాయి. కాగా జయంత్ ఆగ్రో, ఆంకో కమ్యూనికేషన్స్, ఎంటిఎన్ఎల్, ఐటిసి, టాటా పవర్, బిఎస్ఇఎస్, సెంచురి, వార్టిసిలా డిజిల్, జీవీ ఫిల్మ్స్ నష్టాలతోముగిసాయి.
- పోస్టల్రేట్లు భారీగా పెంపు
- ఐటి ప్రాడక్ట్స్ మరింత చౌక
- సిన్హా బడ్జెట్కు వాజ్పేయి కితాబు
- బడ్జెట్200-2002 విశేషాలు
-
సగటు
జీవికి
ఊరట-సంస్కరణలకు
ఊతం