వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిడుగురాళ్ళలో రోడ్డుప్రమాదం
గుంటూరుః గుంటూరు జిల్లాపిడుగురాళ్ళలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. తొమ్మిదిమంది ప్రయాణీకులు గాయపడ్డారు. పిడుగురాళ్ళనుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీబస్సు నాపరాళ్ళతో వస్తున్న లారీని డీ కొనడంతో ఈదుర్ఘనట జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనేముగ్గురు ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించారు.గాయపడిన ప్రయాణాకులను చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
ఆదిలాబాద్జిల్లాలో.........
ఆదిలాబాద్ః ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడమండలంలో గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మరణించారు. నిజామాబాద్నుంచి మహారాష్ట్ర లోని అమరావతి వెళ్ళుతున్న కారు అదుపుతప్పి చెట్టును డీకొనడంతో ఈదుర్ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్నఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
Comments
Story first published: Thursday, March 1, 2001, 23:53 [IST]