కాంగ్రెస్వ్యూహాలకు చెక్ః బాబు Home Full Story
హైదరాబాద్ః అసెంబ్లీలోకాంగ్రెస్ పార్టీ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు ప్రతిఒక్కతెలుగుదేశం సభ్యుడు సర్వసన్నద్ధంగా వుండాలనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచించారు. అసెంబ్లీలో అనుసరించాల్సినవ్యూహంపై తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం గురువారంచంద్రబాబు నాయుడు అధ్యక్షతనజరిగింది. కాంగ్రెస్ సభా పక్ష నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి పోయిన పరువును తిరిగిదక్కించుకొనేందుకు అసెంబ్లీని వేదికగా మార్చుకున్నారనిచంద్రబాబు విమర్శించారు.
స్వప్రయోజనం కోసంతెలుగుదేశం పార్టీపై దాడికి వై.ఎస్. వ్యూహంపన్నారని, ఆ వ్యూహాన్ని తెలుగుదేశం సభ్యులుఅందరూ సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. నాఫ్తా పవర్ ప్రాజెక్టులవిషయంలో ప్రతిపక్షాల దాడిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సభ్యులంతాసిద్ధంగా వుండాలని ఆయన సూచించారు.
వ్యవసాయ రంగం ముఖ్యంగా రైతులకువిద్యుత్ సరఫరా అంశాన్ని ప్రతిపక్షాలుప్రభుత్వంపై దాడికి అస్త్రంగా ఉపయోగించుకొనేఅవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ అంశంపై సభ్యులంతాస్పష్టమైన అవగాహనతో ప్రతిపక్షాలను కట్టడిచేయాలని ఆయన సూచించారు.