వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్: రాష్ట్రంలోనిస్వయం సహాయక గ్రూప్లను తెలుగుదేశం ప్రభుత్వం
ఇతరేతర పనులకువాడుకుంటుందని విమర్శిస్తూ అందుకు నిరసనగా సిపిఎం గురువారం శాసనసభనుంచి వాకౌట్ చేసింది. డ్వాక్రా వంటి స్వయంసహాయక గ్రూప్ సభ్యులను తెలుగుదేశం పార్టీ సభలకు జన సమీకరణజరిపేందుకు వాడుకుంటోందని, వారికి తగిననిధులు కూడా విడుదల చేయడం లేదని సిపిఎం సభ్యుడునర్సింహయ్య అన్నారు.
రివాల్వింగ్ ఫండ్ విడుదలవిషయంలో ప్రభుత్వం చెప్పుతున్నలెక్కల్లో నిజాలు లేవని ఆయన అన్నారు.కేంద్ర నిధులతోనే సరిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంవారికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆయనఅన్నారు. స్వయం సహాయక గ్రూప్ సభ్యులచేత ఉపాధికి సంబంధం లేని పనులు చేయిస్తున్నారనిఆయన విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పోచారంశ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాధానానికి సంతృప్తిచెందని సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్చేశారు.
Comments
Story first published: Thursday, March 1, 2001, 23:53 [IST]