వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుద్ధులకూల్చివేతపై భారత్‌ ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః మత దురహంకారంతోఆఫ్ఘనిస్తాన్‌ లోని చారిత్రాత్మక బుద్ధ విగ్రహాలనుతాలిబన్లు ధ్వంసం చేస్తున్నారు. మోర్టార్లు,డైనమైట్లు పెట్టి ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైనబుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్నితాలిబన్లు చేపట్టారు. ఈ చర్యను ప్రపంచదేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్లు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండడం పట్ల భారత్‌ ఆందోళనవ్యక్తం చేసింది. తాలిబన్ల దుశ్చర్యనుఆడ్డుకోవాల్సిందిగా భారత పార్లమెంటు ప్రపంచదేశాలకు, ఐక్య రాజ్య సమితికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్నిఆమోదించింది. లోక్‌ సభలో స్పీకర్‌ జిఎంసిబాలయోగి ఈ అంశంపై తీర్మానాన్ని ప్రతిపాదించగా, రాజ్యసభలోవిదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగి తీర్మానాన్నిప్రవేశపెట్టారు. ఉభయ సభలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగాఆమోదించాయి.

రెండు వేల సంవత్సరాలనాటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద బుద్ధ విగ్రహాన్నిధ్వంసం చేసేందుకు తాలిబన్లు నడుంకట్టారు. ఈ చర్యను బాబ్రీమసీదు కమిటీ అధ్యక్షుడుసయ్యద్‌ షాబుద్దీన్‌ కూడా తీవ్రంగా ఖండించారు. పలు ప్రపంచదేశాలు చేస్తున్న విజ్ఞప్తులను బేఖాతరు చేస్తూతాలిబన్లు పలు చారిత్రక బుద్ధ విగ్రహాలవిధ్వంస కాండను చేపట్టారు. బౌద్ధాన్ని ఆదరిస్తున్ననేపాల్‌, బూటాన్‌, ధాయ్‌ లాండ్‌ దేశాలు తాలిబన్లదుశ్చర్యను తీవ్రంగా ఖండించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X