వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యూహం లేకనే టెస్ట్‌లో ఓటమిః ముత్తయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఆస్ట్రేలియాతోముంబయ్‌ లో జరిగిన తొలిటెస్ట్‌ మ్యాచ్‌లో సరైన వ్యూహం లేని కారణంగానే ఓటమిపాలయ్యామని బిసిసిఐ అధ్యక్షుడు ముత్తయ్య శనివారంకొత్తఢిల్లీలో ప్రకటించారు. కట్టుదిట్టమైనవ్యూహంతో, మెరుగైన ఆటతీరుతో మిగిలినమ్యాచ్‌ లలో భారత్‌ ఘన విజయం సాధింస్తుందనేవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. జట్టులోనిఆటగాళ్ళలో ఉత్సాహాన్ని, స్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యతకెప్టెన్‌ గంగూలీ, కోచ్‌ జాన్‌ రైట్‌భుజస్కంధాలపైనే వున్నదనిముత్తయ్య అభిప్రాయపడ్డారు.

ముంబయ్‌ లో జరిగిన తొలిటెస్ట్‌ మ్యాచ్‌ లో భారత్‌ ఘోరంగా ఓటమి పాలైనవిషయం విదితమే. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండుటెస్ట్‌ మ్యాచ్‌ లు, ఐదు వన్డే మ్యాచ్‌ లుజరగాల్సి వుంది. ఆస్ట్రేలియా ఊపు చూస్తుంటే భారత్‌ ఈసిరీస్‌ లో ఒక్క మ్యాచ్‌ అయినా గెలుస్తుందా అనే అనుమానాలుసర్వత్రా వ్యక్తం అవుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X