ప్రాజెక్టులపై విచారణఅనవసరం: బాబు
హైదరాబాద్: నాఫ్తా ఆధారితవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకు అక్రమంగా గ్యాస్కేటాయించారనే ఆరోపణలపై విచారణ అవసరంలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుచెప్పారు. కోనసీమ ఓక్వెల్, ల్యాంకో విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకుగ్యాస్ కేటాయించడంలో అక్రమాలు జరిగాయనే ప్రతిపక్షాలవిమర్శలను ఆయన శనివారం ఖండించారు. నాఫ్తా ఆధారితవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులపై 304 నిబంధనకింద జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.గ్యాస్ కేటాయింపులో ఎటువంటి అవకతవకలూ లేవనిఆయన అన్నారు.
ప్రభుత్వంపై బురద చల్లడానికేకాంగ్రెస్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందనిఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగారాష్ట్రంలో చేస్తుంటే అధికార యంత్రాంగాన్ని,ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఆరోపణలుచేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.అర్థం కాకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్లి చూసి వచ్చి మాట్లాడాలనిఆయన ప్రతిపక్షాలకు సలహా ఇచ్చారు.
అంతకు ముందు కోనసీమ ఒక్వెల్ ప్రాజెక్టువ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని ప్రతిపక్ష నాయకుడు డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం శాసనసభ్యుడునోముల నర్సింహయ్య కూడా ఇదే డిమాండ్చేశారు. ఈ వ్యవహారంపై సభా సంఘం వేయాలనిమజ్లీస్ శాసనసభా పక్షం నాయకుడు అసదుద్దీన్ఓవైసీ డిమాండ్ చేశారు.
- క్షమాపణకుదేశం పట్టు-తప్పు కాదన్న వైయస్
- ప్రాజెక్టు మాకొద్దు: మనస్తాపంతో బాలయోగి
- సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ
- విద్యుత్ గోల్ మాల్ పై విచారణఃవై.ఎస్.
- అట్టుడికిన అసెంబ్లీ-వాయిదా