వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఎంసితో ఇక చర్చలు లేవు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసితో పొత్తు చర్చలు జరిపే ప్రసక్తే ఇకలేదని తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. శనివారం నాడు విలేకరులతో మాట్లాడుతూ, టిఎంసి ప్రతినిధి అలగిరి తమ పార్టీ ప్రతినిధులతో మంతనాలు జరిపి, ఆ తర్వాత ఈ చర్చలకు పెద్దగా ప్రాధాన్యతలేదన్నట్టుగా ప్రకటించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిఎంసి నేతలు మరోసారి చర్చలకు ముందుకువచ్చినా తాము వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటుకు సంబంధించిన చర్చలు త్వరలోనే ప్రారంభించనున్నట్టుగా ఆయన చెప్పారు. బీజేపీ కనీసం 45 సీట్లను కోరుకుంటున్నట్టుగా వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా తానేమీ వ్యాఖ్యానించదల్చుకోలేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X